Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 1 Section 5

Bhagavat Gita

1.5

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపి ధ్వజః {1.20}

ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః హృషీకేశ౦ తదా వాక్యం ఇదమాహ మహీపతే

పిమ్మట ఓ రాజా! శస్త్ర యుద్ధము కాబోవు సమయాన కపిధ్వజుడగు అర్జునుడు సమర సన్నుద్ధులై యున్న దుర్యోధనాదులను జూచి విల్లు నెక్కుపెట్టి శ్రీకృష్ణుని జూచి ఇలా పలికెను

అర్జున ఉవాచ:

సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత {1.21}

యాన దేతా న్నిరీక్షే అహం యోద్ధుకామా నవస్థితాన్

హే అచ్యుతా! రెండు సేనల నడుమ నా రథమును ఉంచుము.

కైర్మయా సహ యోద్ధవ్య మస్మిన్ రణ సముద్యమే {1.22}

కైర్మయా సహ యోద్ధవ్య మస్మిన్ రణ సముద్యమే

ఈ రణరంగమున నేను ఎవరితో పోరాడవలెనో అట్టి యుద్ధము చేయగోరి నిలుచున్న వారిని చూచెదను

యోత్స్యమానా నవేక్షే అహం య ఏతే అత్ర సమాగతాః {1.23}

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ర్యుద్ధే ప్రియచికీర్షవః

దుర్బుద్ధియగు దుర్యోధనునికి యుద్ధమందు మేలు జేయగోరి ఇచ్చట సమాగతులైన యుద్ధవీరులను నేను చూచెదను.

సంజయ ఉవాచ:

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత {1.24}

సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్

ఓ ధృతరాష్ట్రా! అర్జును డిట్లు పలుకగా శ్రీకృష్ణుడు భీష్మద్రోణులు మొదలగు రాజులకు ఎదురుగ గొప్పదియగు రథమును ఉభయసేనలకు మధ్య నిలిపి,

భీష్మ ద్రోణ ప్రముఖత స్సర్వేషా౦చ మహీక్షితామ్ {1.25}

ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి

"అర్జునా! యుద్ధమునకు సన్నద్ధులై యున్న ఈ కౌరవులను వీక్షింపుము" అనెను

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రూనథ పితామహాన్ {1.26}

ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీ౦ స్తథా శ్వశురాన్ మహృదశ్చైవ సేనయో రుభయో రపి

పిమ్మట, అచ్చట ఉభయ సేనల యందున్న తండ్రులను, తాతలను, గురువులను, మామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను గూడ అర్జునుడు చూచెను.

తాన్ సమీక్ష్య స కౌ౦తేయ స్సర్వాన్ బ౦ధూ నవస్థితాన్ {1.27}

కృపయా పరయా ఆవిష్టో విషీద న్నిద మబ్రవీత్

యుద్ధ సన్నద్ధులై యున్న బంధువులను జూచి అపార దయాపరవశుడై అర్జునుడు దుఃఖించుచు ఇలా పలికెను

అర్జున ఉవాచ:

దృష్ట్వేమం స్వజనం కృష్ణ {1.28}

యుయుత్సుం సముపస్థితమ్

కృష్ణా! యుద్ధమునకు వచ్చిన ఈ బంధువులను గాంచి నా అవయవములు శిధిలము లగుచున్నవి.

సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి {1.29}

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే

నోరు ఎండి పోవుచున్నది. శరీరము వణకుచున్నది. గగుర్పాటు కలుగుచున్నది

మనం చెయ్యవలసిన పనులు చెయ్యక, పనికిమాలిన పనులు చేస్తే కలిగేది గందరగోళం. ఇది మనం బంధు మిత్రులతో కలహించి, మన స్వచ్ఛంద భావాలు, వేర్పాటులతో పోరు చెయ్యకపోవడం వలన కలిగేది. అర్జునునికి యుద్ధం చెయ్యవలసింది తన అంతరాత్మతోనే అని నెమ్మదిగా తెలిసివస్తున్నాది. మనస్సులోంచి ప్రతి స్వార్థ పూరిత ఆలోచనను తీసివేయడానికై మనలాగే అర్జునడు "నేను నా బంధుమిత్రులతో ఎలా యుద్ధం చెయ్యడం?" అని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు.

కొందరు చిన్నప్పటినుంచీ ఇంద్రియాలతో సుఖం అనుభవించడమే జీవిత లక్ష్యమని, వాటిని తిరస్కరిస్తే జీవితం వ్యర్థమని భావిస్తారు. వారి ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్తున్నకొద్దీ కోరికలు నియంత్రింపబడి, సంతోషంగా ఉండడానికి బదులు ఆందోళనతో, భద్రత కి బదులు వస్తువులను సేకరించడం చేస్తారు. వారు తరచు నిరాశ పొందినా, శాశ్వతమైన ఆనందం ఒక వస్తువులాగ తలచి దానికై ప్రాకులాడుతారు. గతంలో అపజయం పొందినా, మరల మరల దానికై ప్రయత్నిస్తారు. నేను రెండు కుక్కలు తోటను తడిపే కొళాయిలోంచి వచ్చే నీటిమీద ఆవిర్భవించిన ఇ౦ద్రధనుస్సును పట్టుకోవడానికి ప్రయత్నించడం చూసేను. వాటికి అది ఒక భ్రాంతి అని, దానిని ఎన్నటికీ పట్టుకోలేవని తెలియదు. అలాగే కొందరు ఆనందం, పరువు ప్రతిష్ఠలు, లాభానికై ప్రయత్నిస్తున్నారు. వారికి ఎన్ని మార్లు ప్రయత్నించి విఫలమైనా వాని గురించి పూర్తి అవగాహన కలుగలేదు.

ప్రసార మాధ్యమాలు, ప్రకటనలు మన దృష్టిని శాశ్వతమైన ఆనందం మీద కాకుండా క్షణికమైన సుఖాల వైపు మళ్ళిస్తాయి. వాటివలన చిన్న వయస్సు నుంచి దేహేంద్రియ మనస్సులను సంతోష పరిచే విషయాలపై ఆసక్తి చూపిస్తాము. మన౦ ఇంద్రియాలకు, మనస్సుకు తర్ఫీదు ఇచ్చి అహంకారం మీద ఎదురు తిరగడానికి భయపడతాం. ధ్యానం ద్వారా మనకు తెలిసే ముఖ్యా౦శం అహంకారం ఒక నియంతగానై సమస్త జ్ఞానానికి, సృష్టికి మూలమైన ఆత్మ యొక్క స్థానాన్ని లాక్కుందని. ఆ విధమైన జ్ఞానంతో నిత్యం ఉండగలిగితే అహంకారాన్ని జయించిన వారలమవుతాము. 34

Eknath Gita Chapter 1 Section 4

Bhagavat Gita

1.4

పాంచజన్యం హృషీ కేశో దేవదత్తం ధనంజయః {1.15}

పా౦డ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః

శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, భయంకరమైన కార్యములు చేయు భీముడు పా౦డ్రమును పూరించిరి

అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః {1.16}

నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ

కుంతీ కుమారుడును, రాజును అగు ధర్మరాజు అనంత విజయమను శంఖమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పక మను శంఖమును,

కాశ్యశ్చ పరమేష్వాస శ్శిఖండీ చ మహారథః {1.17}

ధృష్టద్యుమ్నో విరాటశ్చసాత్యకి శ్చాపరాజితః

ఉత్కృష్టమైన విల్లు గల కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయ మెరుగని సాత్యకియు,

దృపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృధివీపతే {1.18}

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్పృథక్

హే రాజా! దృపదుడు, ద్రౌపది కుమారులు, గొప్ప భుజములుగల శుభద్ర తనయుడగు అభిమన్యుడు అందరు వేరువేరుగ తమ శంఖములను పూరించిరి

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ {1.19}

నభశ్చ పృధివీం చైవ తుములో వ్యనునాదయన్

ఆ భయంకరమైన శంఖనాదము భూమ్యాకాశములను ప్రతిధ్వనింపజేయుచు, దుర్యోధనాదుల హృదయములను తల్లడిల్ల జేసెను ఀ

కురుక్షేత్రంలో విలుకాళ్లు, మావటులు తో యుద్ధం జరిగితే నేటికాలంలో తుపాకులతోనూ, మారణాయుధాలతోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. దేశ కాలాలు, ఆయుధాలు మారేయిగానీ యుద్ధాలు జరగడానికి కారణాలు మారలేదు. "ద్వేషము ప్రేమ వలననే తొలగుతుంది" అని బుద్ధుడు చెప్పెను. హింసాకాండను హింసతో ఎదుర్కోలేము. పగ, కక్ష సాధింపు ఇరు పక్షాలను మరింత దూరం చేసి, జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.

స్వచ్ఛంద౦గా ఉంటే అభద్రత, అనారోగ్యం, ఒంటరితనం, దుఃఖం కలుగుతాయి. ఎవరైతే పేరు ప్రతిష్ఠలకై, స్వలాభానికై, తమ కుటుంబాన్ని, సమాజాన్ని విస్మరించి స్వార్థపూరితంగా బ్రతుకుతారో వారికి నిరాశ తప్పదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి "ఒకరికి ఇవ్వడం ద్వారా మనం పొందుతాం. క్షమించడం వలన మనం క్షమింప బడతాం" అని చెప్పిరి. చాలా మందిలో ఎంత దోచుకుంటే అంత పొందుతాం, కోపాన్ని ప్రదర్శించడంవలన సంబంధాలు మెరుగుపడతాయి, స్వచ్ఛందంగా ఉంటే సంతృప్తి కలుగుతుంది అనే తప్పుడు భావాలు ఉన్నాయి. ఇతరులను మోసం చెయ్యడం, వస్తువులను పోగుచేసుకోవడం వలన ఆనందం ఎన్నటికీ రాదు. భద్రత ఆయుధాల వలన కాక, వ్యక్తుల, జాతుల, దేశాల మధ్య నమ్మకం, గౌరవం ఉంటే కలుగుతుంది. శాంతి మన హక్కులు ఇతరుల హక్కుల కన్న ఎక్కువని భావించడం వలన కాక, మన బంధు మిత్రుల లేదా మానవాళి క్షేమానికై పాటు పడడం వలన వస్తుంది. ఇదే ధ్యానంలో కలిగే జ్ఞానం: ఆధ్యాత్మిక మార్గంలో పరాజయ౦ కలుగదు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా, మార్గ దర్శిగా ఉండి స్వచ్ఛంద భావాలను తొలగించుకోవడానికి తోడ్పడుతాడు.

శ్రీకృష్ణుని కున్న అనేక నామాలలో హృషీకేసుడు అను నామము ఉన్నతమైనది. దాని అర్థం ఆయన కేశాలు ఆనందంతో నిక్కబొడుచుకొని ఉంటాయని. అలాగే అర్జునుని నామాలలో ధనంజయ అను నామము విశిష్టమైనది. దాని అర్థం ధనాన్ని జయించినవాడు అని. ఇది ధ్యానం చేయువానికి కూడా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే అసలైన ధనం పరుల సేవతోనే వస్తుంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. మన స్వచ్ఛంద భావాలు అంత వేగిరాంగా పోవు. అహంకారంతో మన పోరు దీర్ఘకాలం సాగి ఒక్కొక్కప్పుడు జీవితా౦తం పట్టవచ్చు. ఎప్పుడైతే ఈ సవాలును తీసికొంటామో నిరాశ లేక, విజయం పొందడానికి కావలసిన సమర్థత, బలం, కోరిక కలుగుతాయి. క్రోధం మొదలగు చెడ్డ గుణాలను నియంత్రించి మన లక్ష్యానికై ఉపయోగిస్తాము. క్రోధ౦ మన అదుపులో పెట్టుకొని ఒక శక్తిగా వాడుకొంటాం. చాలా మంది యోగులు ఈ సవాలును తీసికొని కృత్యకృత్యులైనారు. బుద్ధుడు "ఒకడు వేలాది సార్లు, వేలాదిమందిని యుద్ధంలో ఓడించవచ్చు. కానీ ఇంకొకడు తనని తానే ఓడించుకొంటే యోధులందరిలో వాడే గొప్పవాడు" అని చెప్పెను. ఒక యోగికే తెలుసు స్వచ్ఛంద భావాలను ఎటువంటి కష్టాలతో నియంత్రించాలో; సహనాన్ని పరీక్షించే పరిస్థితులను ఎలా గెలవాలో; ఇతరులు దూషిస్తున్నా వారిని క్షమించగలిగే స్వభావం ఎలా పొందాలో. 31

Eknath Gita Chapter 1 Section 3

Bhagavat Gita

1.3

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః {1.12}

సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్

పరాక్రమవంతుడును, కురువృద్ధుడును, పితామహుడును అగు భీష్మాచార్యులు దుర్యోధనునికి సంతసమును కలిగించుటకు బిగ్గరగ సింహనాదము చేసి శంఖమును పూరించెను

తత శ్శ౦ఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః {1.13}

సహసై వా భ్యహన్య౦త స శబ్ద స్తుములో అభవత్

పిదప శంఖములును, దుందుభులును, తప్పెటలును, మృదంగములును, బూరలును కౌరవసైన్యమున ఒక్కసారిగ మ్రోగింప బడినవి. ఆ శబ్దములు అంతటను వ్యాపించెను

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ {1.14}

మాధవః పాండవశ్చైవ దివ్యౌ సంఖౌ ప్రదధ్మతుః

పిమ్మట, తెల్ల గుఱ్ఱములు గట్టిన గొప్ప రథము నందాసీనులై యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి

కురుక్షేత్రంలో మంచి, చెడు మధ్య జరిగిన మహాసంగ్రామంలో అర్జునుడు మనకందరికీ ప్రతీక. ప్రతి జీవిలోనూ ప్రేమతో నెలకొన్న శ్రీకృష్ణుడు అతని మిత్రుడు, సఖుడు, గురువు, మార్గదర్శి. శ్రీకృష్ణుడు ఎక్కడో అంతరిక్షంలో లేడు. అతను మన దేహానికన్నా దగ్గరలో ఉన్నాడు. క్రిష్ అనగా లాగుకొనుట. మనలోని కృష్ణుడు మనని తనవైపు లాక్కొ౦టున్నాడు. శ్రీకృష్ణుడు అనాదిగా, సర్వవ్యాపకమై ఉన్నాడు. అతడే విశ్వమంతటిని ఐకమత్యంతో నడిపించే యాదార్థమైన చేతన శక్తి. 28

Eknath Gita Chapter 1 Section 2

Bhagavat Gita

1.2

సంజయ ఉవాచ {1.2}

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢ౦ దుర్యోధన స్తదా

ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్

అప్పుడు రాజగు దుర్యోధనుడు వ్యూహాకారముగ {1.3}
నిర్మించ బడియున్న పాండవసేనను జూచి, గురువగు ద్రోణా చార్యులు వారిని సమీపించి చెప్పుచున్నారు

పైశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్

వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా

ఆచార్యా! నీ శిష్యుడును, బుద్ధిమంతుడును, దృపదుని {1.4}
కుమారుడును అగు ధృష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగ నిలుపబడి యున్న పాండవుల గొప్ప సైన్యమును వీక్షి౦పుము

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి

యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథః

ఈ పాండవసేన యందు శూరులును, గొప్ప {1.5}
విలుకా౦డ్రును, భీమార్జునలతో సమానులును గలరు. సాత్యకీయ, విరాట రాజును, మహారథుడగు దృపదుడును

ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్

పురుజి త్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః

మఱియును ధృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన {1.6}
కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, మానవ శ్రేష్ఠుడైన శైబ్యుడు,

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః

పరాక్రమ శాలి యగు యుధామన్యుడును, బలవంతుడగు ఉత్తమౌజుడును, సుభద్ర పుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు గలరు. వీరందరు మహారథులే

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ {1.7}

నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థ౦ తాన్ బ్రవీమి తే

ఓ బ్రాహ్మణోత్తమా! మన వారిలో ఉత్కృష్టులు, మన సైన్యమునకు నాయకులై యుండువారిని మీకు జ్ఞాపకము చేయుటకు చెప్పుచున్నాను. అవధరింపుడు

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి౦జయః {1.8}

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ

మీరు, భీష్మాచార్యుడు, కర్ణుడు, సమరవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును,

అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః {1.9}

నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః

ఇంకను అనేకమంది వీరశూరులు నా కొరకు ప్రాణములను విడుచుటకు అరుదెంచి యున్నారు. అనేకములగు శస్త్రాస్త్రములను ధరించి యున్నారు. యుద్ధ సమర్థులై యున్నారు

అపర్యాప్త తదస్మాకం బలం భీష్మాభిరక్షితం {1.10}

పర్యాప్త౦ త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం

భీష్మాచార్యులు వారిచే రక్షింపబడుచున్న మన సైన్యము అపరిమితమైనది. భీమునిచే రక్షింపబడుచున్న పాండవుల సేన పరిమితమైనది

అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః {1.11}

భీష్మమేవాభి రక్ష౦తు భవంత స్సర్వ ఏవ హి

సర్వవిధముల మీరందరు మీమీ నియమిత స్థానములలో యుండి భీష్ముల వారిని రక్షి౦తురు గాక ఀ

మతము యొక్క ముఖ్యోద్దేశం జీవ సమైక్యత. ఇదే మానవులకు మూల స్తంభం. పరావిద్య చుట్టూ ఉన్న సమస్యలను కొంత వరకు పరిష్కరిస్తుంది. కానీ అపరావిద్య మనకు ప్రత్యక్షానుభవము ఇస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాల వలన శ్రీకృష్ణుడు, జీసస్, బుద్ధుడు మొదలగు వారల గురించి తెలిసికొనవచ్చును. కానీ వారి బోధను నిత్యజీవితంలో ఆచారిస్తామా? అది నేను జీవితంలో చేయబోయే సుదీర్ఘ యుద్ధానికి సహకరిస్తుందా?

శ్రీకృష్ణుడు మనలోని అంతర్యుద్ధానికి కావలసిన గుర్తులు, ప్రణాళిక, ఆయుధాలు అత్యంత దయతో ఇస్తాడు. మొదట గీత కౌరవుల, పాండవుల గుణాల గూర్చి చెప్తుంది. కౌరవులు మరణాన్ని, శోకాన్ని కలిగించే దుష్ట శక్తి. పాండవులు ఆహ్లాదము, భద్రత కలిగించే వెలుగు. ఇది ప్రేయ మరియు శ్రేయ అని పురాణాలలో చెప్పబడినది. ప్రేయ అనగా కొన్నాళ్ళు ఉండీపోయే ఇంద్రియలోలత్వం. ఇది చెడు అలవాట్లతోనూ, ఇతరులను బాధించేది గానూ ఉంటుంది. శ్రేయ వలన మానవ కళ్యాణానికి ఉపయోగపడే మంచి అలవాట్లు, యుద్ధానికై పూనుకొన్న ఇరుపక్షాలను మధ్య శాంతి, పరోపకారము కలుగుతుంది. ఈ రెండు అంశాలు ఇప్పటికీ వర్తిస్తాయి. మానవాళి పేదరికాన్ని, వ్యాధులను నిర్మూలించడంలో కొంత మటుకు సఫలమయింది. అలాగే అతి భయంకరమైన మారణాయుధాలను కూడా పోగుచేసుకొంది. మనము శాంతి, స్వేచ్చ ఆశిస్తాము. అలాగే స్వార్థంతో, లాభానికై, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాము. శ్రీ రామకృష్ణ "నువ్వు తూర్పు వెళ్లాలంటే పడమరవైపు చూడవద్దు" అని అన్నారు. మనకు మనమెళ్ళే దిక్కును ఎన్నుకునే శక్తిని పోగొట్టుకొని అంధకారంలో బ్రతుకుతున్నాం.

వెలుగు, చీకటి శక్తులను నిత్య, అనిత్య అని కూడా చెప్పుకోవచ్చు. నిత్య అనగా శాశ్వతమైన, మార్పులేని వెలుగు. దాని వలన మనకు కీడు తలపెట్టినవారిని క్షమించుట, మనతో ఏకీభవించని వారితో సామరస్యం కలిగి ఉండుట సాధ్యము. అనిత్య అనగా ఆశాశ్వతమైనది, దుఃఖాన్ని కలిగించేది. దానివలన క్రోధము; కుటుంబమునకు, సమాజమునకు ఉపయోగంలేని పనులు చేయడం కలుగుతుంది. మనము ఇతరులతో కలహించినా, అంతర్యుద్ధం చేస్తున్నా, ఇతరులకు లేదా మనకు హాని చేసుకొంటాం. అలాకాక మనం స్వచ్ఛంద అభిప్రాయాలతోనూ, నీచ బుద్ధితోనూ పోరు చేస్తే ఇతరులకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాం. ఇదే అన్ని గ్రంధాలూ చెప్పేది. ధ్యాన మార్గాన్ని అవలంబించి క్రోధ౦ మొదలగు అరిషడ్వర్గాలను వీడాలి. మన దృష్టి, శక్తి, ఓర్పు, క్షమ, నిస్వార్థ౦ వైపు మళ్లించాలి. 28

Eknath Gita Chapter 1 Section 1

Bhagavat Gita

1.1

ధృతరాష్ట్ర ఉవాచ

{1.1}
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతసంజయ

ఓ సంజయా! ధర్మభూమి యగు కురుక్షేత్రము నందు యుద్ధము చేయుటకు కూడియున్న నా వారును పాండవులును ఏమి చేసిరి? ఀ

"గీత ఒక చారిత్రాత్మక బోధ మాత్రమే కాదు. ఆధ్యాత్మిక విషయాలు ఒ౦ట బట్టాలంటే దృష్టాంతాలు ఉండాలి. అది దాయాదుల మధ్య జరిగిన యుద్ధమే కాదు. మనలోని మంచి చెడు మధ్య జరుగుతున్న సంగ్రామము కూడా" అని గాంధీ మహాత్ముడు చెప్పెను. చరిత్రకారులు కురుక్షేత్ర యుద్ధం గురించి ఎన్నో విధాలుగా వ్రాసేరు. శ్రీకృష్ణుడు చెప్పిన బోధ ఆ నాటికే కాదు, నేటికి కూడా వర్తిస్తుంది. అది ఆచంద్రార్కం ఉండేది. నేటి కాలంలో ప్రపంచం యుద్ధాలతో నిండివుండి, హింసాకాండ బయట ఇంట జరుగుతూ, క్రోధం బంధాలను తెంచుతూ, చేతన మనస్సులో వేర్పాటు కోరుతూ ఉండగా శ్రీకృష్ణుని గీతా బోధ ఎంతో అవసరము. మనలో జరిగే హింస, పాతుకుపోయిన స్వచ్ఛంద అభిప్రాయాల వలన కలుగుతున్నాది. మనలో చాలామందిలో ఒక యుద్ధ వ్యూహం నిక్షిప్తమై ఉన్నది. అలాగే ఇళ్ళల్లో మెరుపు వేగంతో యుద్ధాలు జరుగుతున్నాయి. యోగులు చెప్పే యుద్ధాలు ఎక్కడో జరిగి, వార్తా పత్రికలలో వ్రాయబడినవి కావు. ఆ యుద్ధాలు స్వచ్ఛంద అభిప్రాయాలవలన వ్యక్తుల, కుటుంబాల, సమాజాల, జాతుల, దేశాల మధ్య జరుగుతున్నాయి.

నేను డిల్లీ నుంచి సిమ్లాకు రైల్లో వెళుతూ ఉండగా దారిలో కురుక్షేత్రం దగ్గర బండి ఆగింది. చాలామంది తోటి ప్రయాణీకులు దాన్ని చూడడానికి దిగేరు. నాకు దాన్ని చూడవలసిన అవసరంలేదు. ఎందుకంటే నాకు అక్కడ వున్న ప్రతి ప్రయణీకునిలో అంతర్యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉందని తెలుసు. మన గ్రంధాలలో యుద్ధానికి సంబంధించిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అవి ఎంతో కష్టంతో, ఎంతో కాలంతో కూడి చిరకాలము ఉండేవి. దానికి కారణం అహంకారం. అదే అన్ని దుఃఖాలకు కారణం. యోగులు మనస్సును, ఇంద్రియాలను జయించిన నిజమైన యుద్ధ వీరులు. వారు అంతర్యుద్ధంలో జయించి, స్వార్థం లేకుండా జీవించమని మనకు చెప్తారు.

కుటుంబంలో, సమాజంలో బ్రతుకుతున్న సామాన్య మానవులకు అంతర్యుద్ధంలో గెలుపు సాధించడం ఎలా? గీతలో శ్రీకృష్ణుడు మణుల హారంవలె ఆధ్యాత్మిక చింతన బోధించి, మనకు తక్షణమే జ్ఞానోదయం కలిగిస్తాడు. మనలోని స్వచ్ఛంద భావాలను, వేర్పాటును ఎదిరించే మార్గాన్ని ధ్యానంలో ఎలా చెయ్యాలో అతడు బోధిస్తాడు. అలాగే జీవితంలో పట్టుదలతో జ్ఞానంతో, క్రోధాన్ని దయగా, పిరికితనాన్ని ధైర్యంగా, లోభాన్ని పరోపకారంగా మార్చే ప్రక్రియను శ్రీకృష్ణుడు బోధిస్తాడు. 24

Friday, March 25, 2022

Book3-Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

13.1
13.2
13.3
13.4
13.5-13.6
13.6
13.7
13.8
13.9
13.10-13.11
13.12
13.13-13.15
13.16-13.17
13.18-13.19
13.20-13.21
13.22-13.23
13.24-13.25
13.26
13.27-13.28
13.29-13.30
13.31-13.34

గుణత్రయ విభాగ యోగము

14.1-14.2
14.3-14.4
14.5
14.6
14.7
14.8
14.9
14.10
14.11
14.12
14.13
14.14-14.15
14.16
14.17
14.18
14.19-14.20
14.21
14.22-14.23
14.24
14.25
14.26
14.27

పురుషోత్తమ ప్రాప్తి యోగము

15.1
15.2
15.3-15.4
15.5
15.6
15.7-15.8
15.9
15.10
15.11
15.12
15.13-15.14
15.15
15.16
15.17-15.19
15.20

దైవాసుర సంపద్విభాగ యోగము

16.1-16.3
16.4
16.5
16.6
16.7-16.9
16.10
16.11
16.12
16.13
16.14-16.15
16.16
16.17-16.20
16.21-16.22
16.23-16.24

శ్రద్ధాత్రయ విభాగ యోగము

17.1
17.2
17.3
17.4
17.5-17.6
17.7-17.10
17.11-17.13
17.14-17.16
17.17-17.19
17.20-17.22
17.23-17.26
17.27-17.28

మోక్ష సన్యాస యోగము

18.1-18.2
18.3-18.4
18.5
18.6-18.10
18.11
18.12
18.13
18.14-18.16
18.17-18.18
18.19-18.22
18.23-18.25
18.26-18.28
18.29-18.32
18.33-18.35
18.36-18.39
18.40-18.44
18.45-18.48
18.49-18.50
18.51-18.52
18.53
18.54-18.56
18.57
18.58
18.59-18.60
18.61-18.62
18.63-18.64
18.65-18.66
18.67
18.68-18.69
18.70-18.71
18.72-18.73
18.74-18.78

Thursday, March 10, 2022

Chapter 18 Section 32

Bhagavat Gita

18.32

సంజయ ఉవాచ:

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః {18.74}

సంవాద మిమ మశ్రౌష౦ అద్బుతం రో మహర్షణమ్

ఈ విధముగ ఆశ్చర్యకరమైనదియు, గగుర్పాటును కలిగించునదియు, మహాత్ముడైన అర్జుననుకును, శ్రీ కృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదనమును వింటిని

వ్యాసప్రసాదా చ్చృతవాన్ ఏతద్గుహ్యమహం పరం {18.75}

యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయత స్స్వయమ్

వ్యాస భగవానుని అనుగ్రహము వలన గుహ్యమైనట్టియు, ఉత్తమమైనట్టియు నగు ఈ యోగ్యశాస్త్రమును యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితిని

రాజన్ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య సంవాద మిను మద్భుతం {18.76}

కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

ధృత రాష్ట్ర మహారాజా! శ్రీ కృష్ణార్జునుల కళ్యాణకరమైన, అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదియు నేను పరవశించి పోతున్నాను

తచ్చ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య రూపమత్యద్భుతం హరేః {18.77}

విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః

రాజా! శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచిన కొలదియు నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది. ఆనందము కలుగుచున్నది.

యత్ర యోగేశ్వరః కృష్ణో {18.78}

యత్ర పార్థో ధనుర్థరః

తత్ర శ్రీ ర్విజయో భూతిః

ధృవా నీతిర్మతిర్మమ

యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుడును, ధనుర్థరుడైన అర్జునుడును ఎచ్చట ఉందురో అచ్చట సంపదయు, విజయము, ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి (రీతి) యుండునని నా అభిప్రాయము

ఎక్కడైతే కృష్ణుడు, అర్జునడు వలెనుండి ఈ కాలాతీతమైన సత్యాలచే మార్గదర్శకత్వం పొందుతారో అక్కడ కాంతి వలె నుండెడి శక్తులు విజయవంత మౌతాయి. జీవితము గ్రుడ్డి శక్తులచే మలచబడే గ్రుడ్డి వస్తువు కాదు. భౌతిక శాస్త్రములోని సిద్ధాంతముల వలె, ఆధ్యాత్మిక శాస్త్రములోని సిద్ధాంతాలు మన ఐకమత్యానికై ఉన్నాయి. ఆ ఐకమత్యాన్ని పాటించకపోతే కొన్ని దుష్ఫలితాలు వస్తాయి. అలాగే దానికనుగుణంగా నడిస్తే ప్రపంచం మనకు చేయూత నిస్తుంది. మనం మానవ మాత్రులమే, కానీ విశ్వ శక్తులు మనకు మద్దతు ఇస్తాయి. మహాత్మా గాంధీ ఇట్లు చెప్పెను:

నేను చేసిన శపథం గొప్పదీ కాదు, ప్రత్యేకమైనదీ కాదు. దేవుడు శరణాగతి కోరిన వారందిరినీ రక్షిస్తాడు. గీత చెప్పింది భగవంతుడు త్యాగ౦ చేసిన వారలచే కర్మ చేయిస్తాడు. ఇక్కడ ఎటువంటి భ్రాంతి లేదు. నేను చెప్పినది ఒక సామాన్య శాస్త్రీయ సిద్ధాంతం. ఎవరికైతే ఓర్పు, సంకల్పం ఉందో వారు దీన్ని పరీక్షించవచ్చు. తద్వారా వాళ్ళు అర్హతను సంపాదించవచ్చు. ఇవి తొందరగా అర్థంఅవుతాయి. ధృడత్వం ఉంటే అవి సులభంగా వంటబడతాయి.

గాంధీ దేశానికి తండ్రివంటివాడు అంటారు. ఆయన ప్రపంచ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన మనకు చూపినది ఒక సామాన్య మానవుడు తన శక్తిని బహిర్గిత౦ చేసి, దేవుని కృపచే పనిముట్టువలె పనిచేసి, ప్రపంచాన్ని కొంతవరకు మార్చవచ్చు.

గాంధీని అర్థం చేసికోవాలంటే గీతని అర్థం చేసికోవాలి. అలాగే గీతని సులభంగా అర్థం చేసికోవాలంటే, గాంధీని అవగాహనకి తెచ్చుకోవాలి. ఆయని గొప్ప ప్రవచనం ఏమిటంటే చెడుకి శాశ్వతమైన స్థానం లేదు. దేవుడు నిజము. అతడు మన అంతర్గతమైన శక్తుల సముదాయము. అతన్ని తీసి పారేయలేము, మార్చలేము, మోసుకుపోలేము. చెడుకి ఉనికి మనము దానితో సహకరిస్తున్నప్పుడే. మనం సూర్యుని ముందు నుంచుంటే, మన నీడ పడదా? మార్గంలో చీకటి ఉంది. అయినా సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుని కాంతికి కలిగే అవరోధాన్ని తీసేస్తే నీడ పోతుంది. చెడు నీడ వంటిది. అది కాంతికి కలిగిన అవరోధాన్ని తీసేస్తే మాయ మౌతుంది. చెడుకు సహకారం చేసే వారికి ఒక భయానకమైన బాధ్యత ఉంది : కొంతకాలం చెడుకు ఉనికి ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ దానికి సహకారం ఆపితే --అనగా నిర్దయ, అవినీతి, హింస, యుద్ధం మొదలైనవి--చెడు మాయమౌతుంది.

మనము రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను మన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించుకోనక్కరలేదు. మనం అంతర్ముఖులమవుతే చాలు. నేను ఐకమత్యాన్ని విఫలం చేసే శక్తికి సహకారం ఆపితే, నేను చెడును కొంత లేకుండా చేసినట్టు. అది మనలో గొప్ప శక్తిని విడుదల చేసి, మన కర్మలను, బాంధవ్యాలను ప్రభావితం చేస్తుంది. ఆ శక్తి క్రమంగా మన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.

గాంధీ వ్యష్టి యొక్క సామర్థ్యతను వివరిస్తున్నాడు. సత్యానికి ఎందరో అవసరం లేదు. ఎవడు చెడుని మనసా వాచా కర్మా విడనాడితే, వానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. గాంధీని "మీరు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొని విజయ౦ పొందేరు?" అని అడిగితే, ఆయన సమాధానం: "అది నేనే చేసేనని ఎలా అంటారు? నేను ఒక పనిముట్టును మాత్రమే". ఆయన చెప్పేది దేవుడు --అనగా సత్యము, ప్రేమ, ఐకమత్యము--ఎల్లప్పుడూ ఉన్నాడు. తన అహంకారాన్ని ఖాళీ చేసి, తన అంతర్గత శక్తికి ఒక వాహనంలా పనిచేసేడు. ఇది అయినప్పుడల్లా, కొంత ఆలస్యమైనా--ఇతరుల హృదయాలు స్పందిస్తాయి.

మనముందున్న శక్తులను పరిశీలిస్తే, మన చిన్న వ్యక్తిత్వం ఎలా వాటిని ఎదుర్కోగలదనే అనుమానం రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది "నువ్వు ఒక్కడివే పని చేస్తున్నవాని ఎందుకు తలుస్తున్నావు?" గురుత్వాకర్షణ ఎలా సదా భూమ్మీద ఉంటుందో, ప్రేమ, సత్యము, దయ అన్ని చోట్లా ఉంటాయి. అలాగే ప్రేమ, ఐకమత్యము జీవితానికి సహజం. మనమెలా వాటికి స్పందిస్తామో, ఇతరులూ అలాగే స్పందిస్తారు. మనం కర్మ ఫలాన్ని దబాయించి అడగలేము. "నీ కర్మ నువ్వు చెయ్యి. దాని ఫలితం నాకు వదిలిపెట్టు" అని శ్రీకృష్ణుడు చెప్పేడు.

ఆధ్యాత్మిక సాధన చాలా కఠినమైనది. దాని వలన జ్ఞానము పొందడం అతి కష్టం. దైవ కృపవలనే అది సాధ్యం. అదే లేక పోతే ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదు.

మనం ఒక్కళ్ళమే లేము. మన ప్రపంచం యాధృచ్చికంగా ఆనందం, ప్రేమ, కాంతి, దిశ, శాంతి, బాధ నుంచి ఉపశమనం లేక లేదు. మన చుట్టూ గాలి, కాంతి, గురుత్వాకర్షణము ఉన్నట్టే సృజనాత్మక శక్తి ఉన్నది. మనం వాటితో ఏకీభావంతో ఉండక పోతే అవి మనకి సహకరించలేవు. మన ఏకీభావం ఇవ్వగలిగితే, ప్రేమ జయిస్తుంది. ఇది గుర్తు పెట్టుకొంటే విశ్వాసం, ఆశ కలిగి విజయం తప్పక వస్తుంది.

Viveka Sloka 33.1 Tel Eng

Telugu English All ఉక్తసాధనసంపన్నస్తత్త్వజిజ్ఞాసురాత్మనః । ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధవిమోక్షణమ్ ॥ 33 ॥ ఉక్త సాధన...