Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 5

Bhagavat Gita

7.5

అపరేయ మిత స్త్వన్యా౦ ప్రకృతిం విద్ధి మే పరాం {7.5}

జీవ భూతా౦ మహాబాహో య యేద౦ ధార్యతే జగత్

అర్జునా! ఇది అపరా ప్రకృతి. దీనికంటె ఉత్తమమైన నా పరా ప్రకృతి కలదు. ఇది ప్రాణులకు జీవరూపమైనది. దీని చేతనే జగత్తు ధరింపబడి యున్నది

ఆది శంకరులు మనము ఆశాశ్వతమైన, మార్పు చెందుతున్న వస్తువులపై మనను గుర్తించుకుంటామని చెప్పిరి. దానిని అధ్యారోపమని అంటారు. అనగా మన పరిమితమైన, ఆశాశ్వతమైన అహంకారమే ఆత్మ లాగ ఎల్లప్పుడూ ఉండేదని తలుస్తాము. "నేను క్రికెట్ ఆడుతాను", లేదా "నేను 6 అడుగుల ఎత్తు" అని అన్నప్పుడు మనము ప్రకృతిని --దేహం మరియు మనస్సు -- చూస్తూ పురుషుడిన చూస్తున్నామనుకొంటాం. ఇటువంటి తికమక ఉన్నంత కాలం జీవితాన్ని నిజంగా దర్శించలేము. ప్రతీదీ మన అహంకారం తో దర్శిస్తాము.

ఈ తికమక మనకే పరిమితం కాదు. అది ఇతరుల మీద కూడా వర్తింపజేస్తాం. మనకు అవసరాలు, అంచనాలు ఉండి వాటిని ఇతరులపై అధ్యారోపము చేస్తాము. ఇది ఎలాగంటే మన అవసరాల, అంచనాల బట్టి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు గల అచ్చులు (mold) చేసి, వాటిని మోసుకు తిరుగుతున్నాం. వాటిని మన తలిదండ్రుల, బంధువుల, మిత్రుల మీద పెడుతున్నాం. మనం పెట్టిన అచ్చుల వలె వాళ్ళ నడవడిక మార్చుకోవాలని చెప్తున్నా౦. హిందువుల పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారి పూల మాలలను మార్చుకొంటారు. కానీ విదేశాల్లో పూల మాలలకు బదులు అచ్చులతో అధ్యారోపము చేస్తారు. పెళ్లికుమారుడు తనకు కావలసిన అచ్చును పెళ్లికుమారి తల మీద కప్పుతాడు. అలాగే పెళ్లికుమారి తనకు కావలసిన అచ్చును పెళ్లి కుమారుని తలమీద పెడుతుంది. మన దగ్గర అటువంటి అచ్చులు ఎన్నో ఉండి, మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద మనకు కావలసిన అచ్చును తల మీద పెడతాం. మన మిత్రుడు తనకు కావలసిన విధంగా చేస్తే, మనము ఆగ్రహము చెందుతాం. ఎందుకంటే అతడు మనం పెట్టిన అచ్చును పాటించటంలేదు. ఆ తరువాత మన మైత్రి చెడిపోయిందని విచారిస్తాం. శంకరులు చెప్పేది అది మన మిత్రుని తప్పు కాదు. అతనిపై మనము చేసిన అధ్యారోపము.

మన బంధాలు సక్రమంగా ఉండాలంటే అధ్యారోపము మాని, మన అచ్చులను కట్టిపెట్టాలి. దానికి ఒకటే మార్గము: మనమీద వేసికొన్న అచ్చును తీసెయ్యాలి. అది ఇతరుల అచ్చులను తీసివేసినంత సులభం కాదు. ఎందుకంటే మన అచ్చులు మనకి బాగా అబ్బేయనే నమ్మకం. మనం మన స్వస్వరూపాన్ని చూసుకొని, ప్రపంచానికి ఎడంగా కాకుండా, విశ్వంలో మనమొక భాగమని తెలిసికొ౦టే, మనం వేసికొన్న అచ్చుకు బీటలు కలుగుతాయి. దీనికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు. దీనిని మన దైనిందన జీవితంలో పాటిస్తే, మన అచ్చు ముక్కలై క్రింద పడుతుంది. అప్పుడు మన, మిగతా వాళ్ళ అసలు స్వరూపం చూస్తాం. అదే పరిశుద్ధమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన ఆత్మ లేదా పురుషుడు. 42

Eknath Gita Chapter 7 Section 4

Bhagavat Gita

7.4

భూమి రాపో అనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ {7.4}

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా

భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగ నున్నది

నా చిన్నప్పటి గ్రామంలో ఒక మసాలా కొట్టు ఉండేది. ఆ కొట్టువాడిని సాంబార్ మసాలా అడిగితే ధనియాలు, ఇంగువ, కారం మొదలైనవాటిని ఒక ఆకులో వేసి, వాటిని కలిపి, పొట్లం కట్టి ఇచ్చేవాడు.

దేవుడు ఇదేపని ప్రకృతిలో చేస్తాడు. సృష్టి లోని మూల పదార్థాలు --అనగా పంచ భూతాలు: ఆకాశం, భూమి, నిప్పు, నీరు, గాలి--ప్రకృతిలోనివి.

శ్రీకృష్ణుడు ప్రకృతి, పురుషుల మధ్య గల భేదాన్ని వివరిస్తున్నాడు. పురుషుడు అన్ని కాలాల్లో ఉండే ఆత్మ. దానిలో మార్పుగాని, పరిమితిగాని లేదు. ప్రకృతికి జననమరణాలు ఉంటాయి. మన దేహం ప్రకృతి లోని పంచభూతాలతో చేయబడినది. మరణించిన తరువాత ఖననం చేసినప్పుడు దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది. మనం ఆవివేకం వలన దేహం చిరకాల ముండేదని తలుస్తాం. మన శరీరంలో ప్రతి అణువు ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనస్సు కూడా ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఆలోచనలని విశ్లేషణము చేస్తే -- అది ధ్యానంవలన సాధ్యం--మన అంతర్గత౦ కూడా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి పదార్థము, శక్తి యేకాక భావాలు, ఆలోచనలు, అహంకారం కలిగి ఉంటుంది. ఇవన్నీ దేహం పుట్టినప్పుడు కలసి వస్తాయి. దేహం పడిపోయిన తరువాత అవి వాటి దారిన పోతాయి.

కఠ ఉపనిషత్తు ప్రకృతిని ఈ విధంగా వర్ణించింది:

ఆత్మ రథంలో ప్రయాణించేవాడు

దేహం రథం

రధికుడు బుద్ధి

ఇంద్రియాలు గుఱ్ఱాలు

స్వార్థ పూరిత ఆలోచనలు వెళ్ళే బాట

ఆత్మ తికమక పడినప్పుడు, దేహేంద్రియ మనస్సులతో సుఖదుఃఖాదులు అనుభవించును,

మనమొక కారు అద్దెకు తీసికొని ఒక గమ్యం చేరాలనుకోండి. ప్రయాణ మధ్యలో వింతలు విడ్డూరాలు చూస్తూ ఉంటే ఆ కారులోని ఇంధనం అయిపోయి, గమ్యం చేరకుండా, తిరిగి కారుని అప్పజెప్పేయాలిసి వస్తుంది. అలాగే మన ప్రాణ శక్తిని లక్ష్యం పై కాక వృధాగా వెచ్చిస్తే లక్ష్యం సాధించకుండా దేహం పడిపోతుంది.

ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచీ మన దేహాభిమానం త్యజించాలి. మొదట్లో అది చాలా కష్టమనిపిస్తుంది. అది ఎలాగంటే మన నాలుకకు రుచులు అలవాటు పడితే దానికి సాధారణ పదార్థాలు రుచించవు. ఒక కుక్కకు తర్ఫీదు ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చినట్లు ఉంటుంది.

ఆధ్యాత్మిక జీవనంలో తాజాగా చేయబడిన పౌష్ఠికాహారాన్ని తినాలి. రోజూ వ్యాయామం చెయ్యాలి. తగినంత నిద్ర పోవాలి. అలాగే చెడలవాట్లను విడనాడాలి. నాతో కలసి ధ్యానం చేస్తున్న అనేక మంది ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లనుంచి విముక్తి పొందేరు. వాళ్ళు మొదట నన్ను కలసినప్పుడు వారిని విమర్శించను. ఎందుకంటే వాళ్ళు ధ్యానం మొదలపెట్టిన కొన్నాళ్ళకి వాటిని వదిలేస్తారు.

ఇంద్రియాలకు తర్ఫీదివ్వడం భౌతిక ప్రక్రియ కాదు. అది మానసిక పరమైనది. నన్ను కలిసిన కొందరు భౌతిక శాస్త్రజ్ఞులు మేము అంతర్గత ప్రపంచాన్ని నమ్మం; మేము దాన్ని మా పరికారాలతో చూడలేము అని చెప్పేరు. నేను చెప్పే అంతర్గత, బాహ్య ప్రప౦చాలు, ఒకే వస్త్రంతో చేయబడినట్లు. ఆరోగ్యం భౌతిక సిద్ధాంతాలతోనే కాక, ఆధ్యాత్మిక, మానసిక స్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రోగం సూక్ష్మక్రిముల వలననేకాక, మానసిక వొత్తిడి, చెడు అలవాట్ల వలన రావచ్చు. మనమందరితోనూ పోటీ పడితే కడుపులో పుండు (ulcer) రావచ్చు. మన క్రోధాన్ని అధిగమించకపోతే ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత రోగాలు కలుగవచ్చు.

పదార్థము ఎలా ప్రకృతిలో ఒక భాగమో మనస్సు కూడా ప్రకృతిని ఆలంబము చేసికొని ఉన్నది. ఆలోచనలను మనము చూడలేము, పట్టుకోలేము. అవి పదార్థము వంటివి కావు అని మనకు తెలుసు. కానీ దాని మీద ఆధారపడిన వాక్కు ఇతరులను బాధించవచ్చు. ఒక విమర్శ వలన ఇతరులకు నిద్ర పట్టకపోవచ్చు. ఇవి అంతా ఆలోచనల శక్తి వలన కలిగినవి.

మేధ కూడా ప్రకృతి. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానము మార్పు చెందుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు పాఠశాల నుంచి తిన్నగా నా అమ్మమ్మ, అమ్మ దగ్గరకు వెళ్ళి ఆ రోజు నేర్చుకున్న విషయాలు చెప్పేవాడిని. ఒక రోజు నేను వాళ్ళకి "భూమి గుండ్రంగా ఉంది" అని చెప్పేను. వాళ్ళు విరగబడి నవ్వేరు. ఇప్పటికీ నా అమ్మ "నా కొడుకు ప్రొఫెసర్, గొప్ప వ్యక్తి, కానీ భూమి గుండ్రంగా ఉందని నమ్ముతాడు" అని ఇతరులకు చెప్తుంది. వచ్చే దశాబ్దాలలో కొందరు శాస్త్రజ్ఞులు భూమి ఆకారం పూర్తిగా గుండ్రంకాదు, దాని ఆకారం మారుతూ ఉంటుందని చెప్పవచ్చు.

చివరగా అహంకారం కూడా ప్రకృతి యనబడును. ఎందుకంటే అది ఆలోచనలు, భావాల వలె శాశ్వతము కాదు. మన ఆలోచనలు, భావాలూ మారుతూఉంటే మన వ్యక్తిత్వము కూడా మారుతూ ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నామని తలచవచ్చు. కానీ చాలామంది ఇతరులతో సంభాషించే టప్పుడు వేరేగా ఉంటారు. కానీ మనలో మారనిది ఒకటి ఉందని చాలా మందికి చూచాయిగా తెలుసు. గీత చెప్తుంది: "నువ్వు ఎప్పుడూ ఒకేలాగ ఉన్నావు. నీ మారుతున్న ఆలోచనలు, కోర్కెలు నీవు కాదు. అవి ఒక ముసుగు. నీవు ముసుగే నువ్వనుకొన్నావు. దాని క్రింద నీ ఆత్మ ఉంది. అది ఎప్పటికీ మారనిది".

Eknath Gita Chapter 7 Section 3

Bhagavat Gita

7.3

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే {7.3}

యతతా మపి సిద్ధానాం కశ్చి న్మాం వేత్తి తత్త్వతః

వేలమంది మనుష్యులలో ఏ ఒక్కడో సిద్ధి కొరకు ప్రయత్నించును. అలా యత్ని౦చెడి వేలమందిలో ఏ ఒక్కడో నన్ను యదార్థముగా తెలిసి కొనును

ఒకమారు నేను ఒక పుస్తకాల కొట్టు లో ధ్యానం గురించ చెప్పడానికి వెళ్ళేను. అక్కడ కొంత మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళు నేను చెప్పిందంతా విన్నారు. చివర్లో నేను వాళ్ళతో కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామని అన్నాను. కొంత సేపయ్యేక నేను కళ్ళు తెరిచి చూస్తే అక్కడ నేను, నా భార్య, పుస్తకాల కొట్టు యజమాని తప్ప ఇంకెవ్వరూ లేరు.

చాలా మంది యోగ లేదా ధ్యానం గురించి విన్నారు. కానీ వారికి సాధన చేయడానికి భయం.

ధ్యానం నిస్తేజంగా ఉంటుంది. దానికై చాలా శ్రమ పడాలి. నేను చాలా ఏళ్లు ధ్యానం చేసి తెలుసుకున్నదేమిటంటే దానికై కోరిక, నిబద్ధత ఉండాలి. నిజానికి దేనిలో రాణించాలన్నా అవి అవసరం. ఉదాహరణకి ఒక ఈతగాడు ఒలింపిక్స్ లో పతకం సంపాదించాలనే లక్ష్యం ఉంటే దానికై చాలా పరిశ్రమ చెయ్యాలి.

ఈ రోజుల్లో బహు తక్కువ మంది ఒక గొప్ప కార్యం చేస్తారు. ఎందరో కొందరు ఒక సామాన్యమైన కార్యాన్ని చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఎంతోమంది జాప్యం చేస్తారు. గోడమీద పిల్లిలాగ ఎటు వెళ్ళాలో నిర్ధారించుకోరు. ఒక మంచి కార్యనికై చాలా ఉత్సాహం ఉండాలి. మన సినిమాలను, కళా ప్రదర్శనలను చూస్తే మనకు తెలిసేదేమిటంటే ఒక చక్కటి అంగీ చేయడానికి, లేదా ఒక మంచి వీణను చేయడానికి చాలా మంది కృషి చేసేరు. వారు ధ్యానంలోకి వస్తే ఎంతో ముందుకు సాగుతారు.

మనం ఎంత కృషి చేసినా, ధ్యానంలో కొన్ని అవరోధాలు వస్తాయి. మన ఇంద్రియాలు, అహంకారం తలెత్తుతాయి. అలాటప్పుడు ఒక గురువు అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం బహు దీర్ఘమైనది మరియు కష్టాలతో కూడినది. మన చేతన మనస్సు లోతులకు వెళ్ళడం ధ్యానంలో కొంత అనుభవం ఉంటే గానీ వీలవ్వదు. మనదగ్గర ఒక క్రొత్త ప్రదేశానికి సంబంధించిన పటం (map) లేకపోతే వేటిని సందర్శించకూడదో, తిరిగి ఎలా రావాలో తెలియదు. అలాగే ధ్యానంలో మెళుకువలు చెప్పి, కష్టాలను ఎలా అధిగమించాలో చెప్పడానికి ఒక గురువు అవసరం ఎంతో ఉంది.

ఒకమారు నేను నా భార్య కొండల మధ్యలోంచి వెళుతూ ఉంటే మా కార్ ఒక రాయి మీదకి ఎక్కి నిలిచిపోయింది. మేమెంత ప్రయత్నించినా కారు ముందుకు వెళ్లలేదు. ఆ దారిన పోతున్న కొందరు యువకులు మాకు సహాయం చేయడానికి వచ్చేరు. కానీ వాళ్ళ వలనా కాలేదు. చివరకు నేను టోవ్ ట్రక్ ని పిలిచేను. ఆ టోవ్ ట్రక్ తో ఐదు నిమిషాలలో కారు కదిలింది. ఒక మంచి గురువు టోవ ట్రక్ నడిపేవాడిలాగ మనని గమ్యానికి అతి తొందరలో తీసికెళ్లగలడు. 35

Eknath Gita Chapter 7 Section 2

Bhagavat Gita

7.2

జ్ఞానం తే అహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్య శేషతః {7.2}

యజ్ఞాత్వా నేహ భూయోఅన్యత్ జ్ఞాతవ్య మావశిష్యతే

దేనిని తెలిసికొనిన పిదప ఈ లోకమున తెలిసికొన దగినది మరియొకటి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును నీకు సమగ్రముగ చెప్పెదను ఀ

ఒకమారు బుద్ధుడు తన శిష్యులతో షింషాపా వనంలో కూర్చొని ఉన్నప్పుడు దేవుడున్నాడా లేడా, అమృతమైన శరీరం ఉంటుందా, విశ్వానికి మొదలు, అంతం ఉన్నాదా అని అనేక ప్రశ్నలు శిష్యులు అడిగేరు. దానికి జవాబుగా బుద్ధుడు కొన్ని ఆకులను చేతితో తీసికొని "ఎక్కడ ఎక్కువ ఆకులున్నాయి: నా చేతిలోనా, చెట్టుమీదా?" అని అడిగేడు.

అందరూ ఏకగ్రీవంగా చెట్టు మీదే అన్నారు.

"అలాగే నా చేతన మనస్సులో మీరు చూడగల దానికన్నా ఎక్కువ ఉంది, మీ అవగాహనకన్నా అమితంగా ఉంది, మీకు ఉపయోగపడేదానికన్నా ఎక్కువ ఉంది. నేను మీకు ఇచ్చేది మీ దుఃఖాలకు కారణమైన జీవితం యొక్క జ్ఞానం"

శ్రీకృష్ణుడు "నేను నీకు జ్ఞానం మరియు విజ్ఞానం ఇస్తాను. నీవు తెలిసికోవలసిందల్లా అదే" అని చెప్పెను. దాని అర్థం ఇక తెలిసికోవలసినది ఏదీ లేదని కాదు. ఈ రెండూ జీవితాన్ని ఒక కళగా మారుస్తాయి.

ఆది శంకరులు జ్ఞానమనగా ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానమనగా ఆధ్యాత్మిక అనుభవము అని చెప్పెను. ఆధ్యాత్మిక జ్ఞానము తక్కిన జ్ఞానము వలె కాక జీవితం గూర్చి ప్రత్యక్ష అనుభవానికి వచ్చు జ్ఞానము. శ్రీరామకృష్ణులు చెప్పినది భగవంతుడు అందరి శరీరాల్లో ఉన్నాడని. అదే మనం సమాధి స్థితిలో తెలిసికొ౦టాం. అతను ఇంకా ఇట్లు చెప్పెను: "పాలు గురించి మాత్రమే విన్నవాడు అజ్ఞాని. పాలును చూసినవానికి జ్ఞానం కలదు. ఎవడైతే పాలను త్రాగి బలం పుంజుకొన్నాడో వానికి విజ్ఞానం ఉంది"

నా దృష్టిలో జ్ఞానం అనగా ఆధ్యాత్మిక వివేకం. విజ్ఞాన మనగా దానిని రోజువారీ జీవనానికి ఉపయోగించడం. జ్ఞానం ప్రపంచంలో చిరకాలం ఉండే సత్యములు. విజ్ఞానము ఆ జ్ఞానాన్ని కర్మకై వినియోగించడం. ఎలాగంటే మన సమస్యలు పరిష్కరించుకోవటానికి, మన బంధాలను గట్టి పరచుకోవటానికి, ఇతరులను ఎడంగా ఉంచకుండా కలిసి మెలసి ఉండాలని చెప్పడానికి. ఎవరైతే జీవిత ఐక్యాన్ని అవగాహన చేసికొని అలా జీవించేరో, వారు జీవితం యొక్క హృదయ స్థానాన్ని తెలిసినవారు. ఎలాగంటే ఒక ఇంటి యజమాని బాగా తెలిసి ఉంటే, ఆ ఇల్లంతా తెలిసినట్టే. జీవితం యొక్క మూలము తెలిసికొ౦టే ఒక సమస్య, దాని పరిష్కారము సులభంగా తెలుస్తాయి.

దీనిలో విచిత్రమైనదేమీ లేదు. అది వివేకము, జ్ఞాన సంబంధితము. చాలా ఏళ్ల ధ్యానం వలన జీవులన్నీ ఒకటే అనే జ్ఞానం కలిగితే, మనము ఎడంగా ఉండలేము. మనం ఒకరిని స్వార్థానికై ఉపయోగించము. ఎవరినీ విచక్షణతో చూడం. మన బాగు ఇతరుల బాగు మీద ఆధారపడి ఉన్నదని తెలిసికొ౦టాము. మన ప్రస్తుత ప్రపంచ సమస్యలు -- వీధిల్లో హింసాకాండ, పర్యావరణ కాలుష్యం, ఒంటరితనం, కుటుంబాలు విచ్ఛిన్న మవడం, బంధాలు తెగిపోవడం-- గురించి తెలిసికొ౦టే చాలదు. మనకు కావలసింది విజ్ఞానం. తద్వారా ప్రజల హృదయాలలో, మనస్సులలో కలిగిన చీలికలు పూర్చి, వారిలో నమ్మకం, ఐకమత్యం కలిగించాలి.

మనకా చాకచక్యం ఒక రోజులో రాదు. మనకు పరోపకారము చేయాలనే తలంపు గాఢంగా ఉండాలి. కొన్నాళ్ళు సాధన చేసి మీ సమస్యలకు పరిష్కారం కనుగొన్న తరువాత, మీరు విశ్రాంతిగా కూర్చోలేరు. మీరు బాధల్లో ఉన్నవారికి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో వివరించాలి. అది చాలా పొందికగా చెప్పాలి. "మీరిద్దరూ పోటీ పడకూడదు. మీకు తెలీదా భార్యాభర్తలు ఒకటేనని?" అని అంటే చాలదు. మనం దానిని ఆచరణలో పెట్టి, మనని చూచేవారిలో "ఆ ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళు ఒకరికి మరొకరు సహాయం చేసికొ౦టారు. నేనూ అలాగే ఉండాలి" అనే భావన కల్పించాలి. కొన్ని సమస్యలు ఏళ్ల తరబడి ఉండచ్చు. మనం వాటిని పరిష్కరించకుండా విశ్రాంతి తీసికోలేం. మన కోరిక, ఏకాగ్రత ఎంత పదునుగా ఉండాలంటే అవి సూటిగా సమస్య యొక్క గుండెకు తగలాలి. ఆ సమస్యల లక్షణాలను, వాటి కారణాలు తెలిసికొని వాటిని సృజనాత్మకముగా పరిష్కరించగలగాలి.

ఈ సామర్థ్యము జీవులంతా ఒక్కటే అన్న జ్ఞానం ద్వారా వస్తుంది. అప్పుడు మనం చుట్టూ ఉన్నవారు -- పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, వగైరా--వేర్వేరుగా కనిపించినా, మనకీ వాళ్ళకీ మధ్య ఎటువంటి తేడా లేదని క్షణమైనా మరచిపోకూడదు.

ఈ దశకు చేరిన తరువాత బంధుమిత్రులిని అపార్థం చేసికోవడం జరగదు. నేను అభిప్రాయాలలో తేడా ఉండదని అనను. నా అనుభవంలో అభిప్రాయ భేదాల వలన అనుబంధాలు చెడిపోవు. అవి నమ్మకం, ప్రేమ లేకపోవడం వలన చెడిపోతాయి.

ఇది మన బంధుమిత్రులకే పరిమితం కాదు. మానవాళి అంతటకీ వర్తిస్తుంది. మీకు విజ్ఞానం ఉంటే, ఎక్కడికి వెళ్ళినా శాంతి దూతగా వెళ్తారు. ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉంటే, ఇరు పక్షాలను అర్థం చేసికొని, మెలగుతారు. మనం సమస్యలను చూసినా, ఇరుపక్షాల బాగుకై వారిలోని ఐకమత్యాన్ని చూస్తాము. ఒకరిని మరొకరు అర్థం చేసికొనేలా చేస్తాము. ఇది చాలా కష్టంతో కూడిన పనైనా, కొన్నాళ్ళకు అందరికి సబబైన పరిష్కారం పొందగలరు.

నేను భారత దేశంలో ఉన్నప్పుడు, ఒక కాలేజీ లో ఉపాధ్యాయుడుగా ఉన్నాను. అక్కడ హిందువులకు ముస్లింలకు పడేది కాదు. నా తరగతిలో వాళ్ళు ఎడంగా ఉండేవారు. నాకు అది చాలా బాధ కలిగించింది.

నా ముస్లిం మిత్రుడు అక్కడే నాలాగే ఉపాధ్యాయుడు. అతడు నేను ఒకే కాలేజీ లో చదివేము. కాని పరిస్థితుల వలన వేర్వేరు దారులలో వెళ్ళేం. నాకు అతని కాలేజీలో ఉద్యోగం వచ్చినపుడు అక్కడ ఎలాగ బ్రతకడం అనే విచారం కలిగింది. నేను రైలు దిగి ఒక జట్కాని కిరాయి చేద్దామని చూస్తూ ఉంటే, నా ముస్లిం మిత్రుడు కనిపించి నన్ను ఆప్యాయంగా పలకరించి తన ఇంటికి ఆహ్వానించేడు.

ఒక ముస్లిం ఇల్లు ఖాళీగా ఉండడంతో మేమిద్దరం అక్కడే నివసించడం మొదలుపెట్టేము. కొందరు మేము అపాయకర స్థితిలో ఉన్నామని, మా ఇద్దరికీ చేటని చెప్పేవారు. మేమది లెక్క చేయక, చెడు కలిగితే ఇద్దరం కలిసి అనుభవిద్దామని నిర్ణయించుకున్నాం.

మేమది ఏదో రాజకీయ పరంగా వ్యూహాత్మకంగా చేయలేదు. ప్రతిఒక్కరికి తెలుసు మేము మంచి మిత్రులమని. అలాగే మా మతాన్ని మేము పాటిస్తున్నాము. చుట్టుప్రక్కలవారు మమ్మల్ని అనుమానించి మామీద నిఘా వేసి ఉంచేరు. క్రమంగా మా మైత్రి మరింత గట్టి పడింది. మమ్మల్ని చూసి మా విద్యార్థులు కొందరు సిగ్గు పడ్డారు. ఒకరి తరువాత ఒకరు కలసి కూర్చొనేవారు. కొంత కాలానికి వాళ్ళు తమలో మాట్లాడుకునేవారు. క్రమంగా వాళ్ళు నవ్వుకుంటూ, కలసి పనిచేయడం మొదలుపెట్టేరు. ఇద్దరు సామాన్య మానవులు ఐకమత్యంతో ఉండి, చుట్టు ప్రక్కలి సమాజాన్ని ఎలా మార్చ గలరో అన్న అంశం ప్రత్యక్షంగా మా కళ్ళను తెరిపించింది. ఇదే విజ్ఞానమంటే. జీవించడానికి దీన్ని మించిన కళ వేరేది లేదు.

Eknath Gita Chapter 7 Section 1

Bhagavat Gita

7.1

శ్రీ భగవానువాచ

{7.1}
మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజ న్మదాశ్రయః

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు

అర్జునా! నాయందు మనసు నిలిపి, నన్నే ఆశ్రయించినవాడవై యోగము నభ్యసించుచు సంశయ రహితముగ, సంపూర్ణముగ నన్ను ఎట్లు తెలిసికొ౦దువో దానిని ఆలకింపుము ఀ

మనం మనకోసమే బ్రతుకుతూ, మన అవసరాలూ, సమస్యలూ గురించి ఆలోచిస్తూ ఉంటే మనమెన్నటికీ ఆత్మ స్వరూపాన్ని తెలిసికోలేము. మనము ఒక ముసుగు చాలా కాలం వేసుకొంటే, మనమా ముసుగే మన స్వరూపమని తలచి, మన నిజ స్వరూపాన్ని మరచి పోతాం. ధ్యానం వలన ఆ ముసుగు తొలగించి ప్రేమ, భద్రత, జ్ఞానం, ఆనంద స్వరూపమైన ఆత్మను తెలిసికోవచ్చు.

యోగ అనగా వ్యాయామం లేదా ఆసనాలు మాత్రమే కాదు. యోగమనగా మనం వేసుకున్న ముసుగును తొలగించి మన ఆత్మతో తాదాత్మ్యం చెందడం.

పతంజలి యోగమును 3 దశలగా వివరించెను: ధారణ, ధ్యాన మరియు సమాధి. అతడు వ్రాసినది ఎంతో నిష్కర్షయైనది. అది ఒక మతపరమైన సిద్ధాంతం కాదు. కానీ అది క్రోడీకరింప బడినది. ఎందుకంటే గురువులు తమ స్వీయానుభవంతో విపులంగా బోధించుటకు వీలవుతుంది.

ధారణ అనగా మనము శరీరము మాత్రమే కాదు. సహజంగా మనమడిగే ప్రశ్న "మన మెవరము?"

మన శరీరము ఒక కోటు లాంటిది. మనం కోటు కొనుక్కొని చిరకాలం వాడలేము. అది ఎప్పుడో చిరిగి లేదా పాతబడి పోతుంది. చివరకు దానిని దానం చేయడమో లేదా పారేయడమో చేస్తాం. అలాగే మన శరీరం కూడా. మరణించినపుడు పాతబడిన కోటు లాగ విడిచి పెడతాం.

మనమెలాగ శారీరం మనం కాదనుకొన్నామో, ఇతరులను కూడా అలాగే భావించవచ్చు. అనగా తెలుపు, నలుపు, ఛామన చాయ, పసుపు వగైరా శరీరాలు అన్నీ మనమేసుకొన్న కోట్లు. దాని వలన శరీర ఛాయను బట్టి జాతిని నిర్ణయించడమనేది ఒక అపోహ. అన్ని రంగుల శరీరాలు అందమైనవే.

శరీర ఛాయను ప్రక్కకు పెడితే, మనము వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూస్తాం. ప్రసార మాధ్యమాలు ఏమి చెప్పినా, పరులను భౌతికమైన వస్తువులుగా చూడడం వలన బంధాలు గట్టి పడవు. భౌతికంగా మనము వేర్వేరు జీవులం. కాలం గడుస్తున్న కొద్దీ శరీరం మీద వ్యామోహం తగ్గుతుంది. కానీ మన సహధర్మచారిణి యొక్క సంక్షేమము మనము కోరితే మన బంధాలు గట్టి పడతాయి.

ధారణ వలన భౌతికమైన సమస్యల మీద స్వాధీనం వస్తుంది. మన సమస్యలు -- వాటికి మూల కారణము మనస్సు అయినప్పటికీ--చాలామటుకు భౌతిక మైనవి. అతిగా తినడం మనస్సుకు సంబంధించిన సమస్య. కానీ మనము మన చేతిని నియంత్రించుకుంటే దాని వలన లాభం ఉంది. నా మిత్రుడొకడు "నేను ఆ కేక్ మొత్తం తినేసాన౦టే నమ్మలేక పోతున్నాను" అని చెప్తాడు. నాకు ఇటువంటి తృష్ణ అర్థమవుతుంది. కాని చేతిని ఉపయోగించి ఆ కేక్ ని ఎందుకు తినడం? మనము తినకూడదనుకొన్నప్పుడు మన చేతి మీద కూర్చొని దానిని నియంత్రించాలి. నేను నా మిత్రుడి కది చెప్పినప్పుడు "ఒక అతీతమైన శక్తి నన్ను ఆవహించి ఆ పని చేతితో చేసింది" అని చెప్తాడు. ఇటువంటి అలవాటు బలవంతమైనది. దానిలో ఆనందం లేదు. ధారణ వలన మనము ఏది తినాలో, తినకూడదో నిశ్చయించుకోగలం.

సాధనలో రెండవ అంశం ధ్యానము. దాని వలన తెలిసికొనేది మనం మనస్సు కూడా కాదు. అయితే మనస్సంటే ఏమిటని అనుమానం రావచ్చు. మన శరీరం ఒక కార్ అనుకొంటే మనస్సు ఇంజిన్ వంటిది. మనస్సు సరిగా పని చేయాలంటే మనం దానిలోని భాగమని తలచకూడదు. మనకి ధ్యానం వలన జ్ఞానం కలిగి మన మనస్సును సరి చేసుకోవడానికి వీలవుతుంది.

ఒక్కొక్కప్పుడు భావోద్వేగం వలన మనకు నిరాశ లేదా భయం కలగవచ్చు. ఇవి మన ఇంజిన్ కు సంబంధించిన స్థితి. అంటే ఆ సమస్యలను పరిష్కరించే మార్గం ఉంది. మనము మన పూర్వ స్థితి కన్న వేరు కామని తలచవచ్చు. అలాగే మన పుట్టుకతోనో, ఆ తరువాతో వచ్చిన నడవడిక మార్చలేమని తలచవచ్చు. మన స్వరూపం శరీరం మరియు మనస్సు అనుకున్నంత కాలం అది నిజం. ధ్యానంతో మన భావోద్వేగం మార్చుకోవచ్చు. దానివలన మనం ధృడత్వాన్ని వశ్యత గాను, భయాన్ని ధైర్యంగానూ, క్రోధాన్ని ప్రేమ గాను మార్చుకోవచ్చు.

పూర్వం ఒక శిల్పి చేసిన శిలా విగ్రహాలు అత్యంత సుందరంగా ఉండేవి. కొందరు అతను చేసిన ఏనుగు విగ్రహాలను విభ్రాంతితో చూసి, అతని రహస్యమేమని అడిగేరు. అతని సమాధానం: "నేను ఒక శిలను తీసికొని ఏనుగు కాని పదార్థాన్ని చెక్కేస్తాను". అలాగే మనం మన వ్యక్తిత్వాన్ని ధ్యానం ద్వారా మలచుకొంటాం.

మన నిజస్వరూపం ఆత్మ. దానిని తెలిసికోవాలంటే ఆత్మ కాని పదార్థాన్ని శిల్పి ఏనుగు కాని శిలని ఎలా చెక్కేడో అలా చెక్కేయాలి. దీనినే వేదాలలో "నేతి నేతి" అంటారు.

ధ్యానం ద్వారా మన నిజస్వరూపాన్ని తెలిసికొని మనను ఆదర్శ వంతులుగా తీర్చిదిద్దు కోవచ్చు. మన చేతనం లోని క్రోధం, భయం, లోభం తొలగించుకోవచ్చు. ఇది మూడవ దశ సమాధికి నాంది. దానివలన మన చేతన, అచేతన మనస్సులోని తేడాలు తొలగిపోతాయి. మనకు ఇతరుల మధ్య గల భేదం కూడా చెరిగిపోతుంది.

మనం సాధన చేస్తే గాని అవి మనకి అవగాహనకి రావు. యోగులు చెప్పేది ఆత్మ జ్ఞానమును పొందటం అతి క్లిష్టమైనదని. భౌద్ధులు చెప్పే పతిసోతగామి అనగా ఎదురీత. మనసా, వాచా, కర్మ కు ఎదురీత.

నేను చిన్నప్పుడు నా మిత్రులతో నదిలో ఈత కొట్టడానికి వానాకాలంలో వెళ్ళేవాడ్ని. అప్పుడు నది నిండుగా ప్రవహించేది. మేము ఎదురీత చేసి ఆవలి గట్టుకు చేరేవారం. మాలో గజ ఈతగాళ్లు నదీ ప్రవాహంలో క్రిందకు వెళ్ళక సమాంతరంగా ఆవలి గట్టుకు చేరుకొనేవారు.

ధ్యానానికి ఇటువంటి ప్రేరణ కావాలి. క్రోధం వరదలా ఉంటే దానికి ఎదురీది దాన్ని వశం చేసికోవాలి. ఎదురీత వలన చేతులు విరిగిపోతాయనిపిస్తుంది. ఊపిరి తిత్తులు తీవ్రమైన ఒత్తిడిని పొందుతాయి. కాని వాటిని సహించి ఆవలి గట్టుకు చేరడంవలన చాలా సాధించేమన్న భావన కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితం చిన్న వయస్కులను, సాహసోపేతులను ఆకర్షిస్తుంది. సెయింట్ తెరెసా, శ్రీ రామకృష్ణ వంటి వారు ఆధ్యాత్మికంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కి చుట్టూ ఉన్న ప్రపంచం దేవుని రూపమని గ్రహించేరు.

శ్రీకృష్ణుడు "నా మీద పూర్తిగా ఆధారపడు" అని ఎందుకు చెప్పేడు? దేవుడి మీద భారం వేసినవారు ఇతరుల మీద ఆధారపడరు. యోగులు చెప్పే భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు. అది మన ఆత్మ. సమాధిలో అన్ని రకాల ఎడబాట్లు పోయి, మన౦ ఆత్మలో రమిస్తాము. దానివలన జీవితం గూర్చి అన్ని అనుమాలూ, ఊగిసలాట, భయం పోతాయి. మనము సంపూర్ణమైన ప్రేమ శక్తిలో ఒక భాగం అవుతాం. దేవుని దయ మనయందు ప్రవేశించి, పరోపకారానికై ఉపయోగిస్తాం. 28

Wednesday, April 6, 2022

book1-index

Eknath Gita Book 1

అర్జున విషాద యోగము

1.1
1.2-1.11
1.12-1.14
1.15-1.19
1.20-1.29
1.30-1.32
1.33-1.41
1.42
1.43-1.44
1.45
1.46
1.47

సా౦ఖ్య యోగము

2.1
2.2
2.3
2.4-2.5
2.6
2.7
2.8-2.11
2.12
2.13
2.14
2.15
2.16
2.17-2.18
2.19-2.20
2.21-2.22
2.23-2.25
2.26-2.28
2.29
2.30
2.31-2.38
2.39
2.40
2.41
2.42-2.44
2.45
2.46
2.47
2.48
2.49
2.50
2.51
2.52-2.53
2.54
2.55
2.56
2.57
2.58
2.59
2.60
2.61
2.62-2.63
2.64-2.65
2.66
2.67-2.68
2.69
2.70
2.71
2.72

కర్మ యోగము

3.1-3.2
3.3
3.4-3.5
3.6
3.7-3.8
3.9
3.10
3.11
3.12-3.13
3.14
3.15
3.16
3.17-3.18
3.19
3.20
3.21
3.22-3.24
3.25
3.26
3.27
3.28-3.29
3.30
3.31
3.32
3.33
3.34
3.35
3.36-3.37
3.38-3.39
3.40
3.41
3.42
3.43

జ్ఞాన యోగము

4.1
4.2
4.3
4.4-4.5
4.6-4.7
4.8
4.9
4.10
4.11
4.12
4.13
4.14-4.15
4.16-4.17
4.18
4.19
4.20
4.21
4.22
4.23
4.24-4.26
4.27-4.28
4.29
4.30-4.31
4.32-4.33
4.34
4.35
4.36
4.37-4.38
4.39-4.40
4.41
4.42

కర్మ సన్యాస యోగము

5.1-5.2
5.3
5.4
5.5-5.6
5.7-5.9
5.10-5.12
5.13-5.15
5.16-5.18
5.19
5.20
5.21
5.22
5.23-5.25
5.26
5.27-5.29

ఆత్మ సంయమ యోగము

6.1
6.2-6.3
6.4
6.5
6.6-6.7
6.8
6.9
6.10
6.11-6.12
6.13-6.14
6.15
6.16
6.17
6.18
6.19-6.23
6.24-6.25
6.26
6.27
6.28
6.29
6.30
6.31
6.32
6.33
6.34
6.35
6.36
6.37
6.38-6.39
6.40
6.41
6.42
6.43-6.44
6.45
6.46
6.47

Eknath Gita Chapter 6 Section 36

Bhagavat Gita

6.36

యోగినా మపి సర్వేషా౦ మద్గతే నాంతరాత్మనా {6.47}

శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్త తమో మతః

ఏ మనుజుడు నా యందు మనస్సు నిలిపి శ్రద్దతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడు యోగులందరి కంటెను ఉత్తముడు అని నా అభిప్రాయము

ధ్యాన యోగులలో కూడా ఉత్తముడు ఏకాగ్రతతో దేవుని కొరకై కర్మలను చేసేవాడు. శ్రీకృష్ణునికి "ఇది నేను తింటే నా దేహానికి బలమిచ్చి దేవుని సేవ చెయ్యగలనా? నేను ఈ విధంగా స్పందిస్తే నా మనస్సును ఉత్తేజ పరచి దేవుని సేవ చెయ్యగలనా?" అని ప్రశ్నించుకొనేవారు ప్రియము. శ్రీకృష్ణుని తమ చేతన మనస్సులో సంపూర్ణముగా నింపుకొన్నవారు అత్యంత ప్రియులు.

మనమందరమూ ఉత్సాహంతో, పద్దతి ప్రకారం, సహనంతో ధ్యానం చేసి శ్రీకృష్ణునికి ప్రియుల మవ్వచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బోధించినది: ధ్యానం చెయ్యకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం, నిస్వార్థం తొలగించుకోలేక; మన నడవడిక, వ్యక్తిత్వం, చేతన మనస్సు సన్మార్గంలో పెట్టుకోలేం. అదే ధ్యానం ఎన్ని అవాంతరాలు వచ్చినా చేస్తే, శ్రీకృష్ణుని అభయం సదా ఉంటుంది. ఆయన మనకి స్వస్థత, భద్రత, సృజనాత్మక శక్తితో సమస్యలను పరిష్కరించగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం పొంది జీవైక్య సమానత మనందరిలోనూ, అని ప్రదేశాల్లోనూ, సర్వకాల సర్వావస్థల యందు కలుగుతుంది.

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...